ఈ రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం. వాక్సిన్ గురించి కీలక సమాచారం.
కరోనా వైరస్ నుంచి ఇప్పటి వరకు ప్రపంచానికి విముక్తి రాలేదు. ఎప్పటికి వస్తాదో కూడా తెలియడం లేదు. మొదటి వేవ్, రెండవ వేవ్ తోనే అలసిపోయిన ప్రపంచం ఇంకా థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి కావాల్సిన సన్నాహాలను, ధైర్యాన్ని కూడబెట్టుకుంటుంది. ఇలాంటి సమయంలో డెల్టా వేరియంట్ ఒకటి మొదలయ్యింది. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఇది భారతదేశాన్ని కూడా తాకింది. దీని బారినపడి తొలి మరణం కూడా మనదేశంలో నమోదు అయ్యింది.మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో డెల్టా ప్లస్ వేరియంట్ సోకి బుధవారం ఒక మహిళ మృతి చనిపోయింది.
మృతురాలి నుంచి తీసుకున్న నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ ఆధారంగా సదరు మహిళ కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ వల్లనే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. సదరు మహిళ ఈ ఏడాది మే 23న డెల్టా వేరియంట్ బారిన పడినట్లు తెలిపారు. బాధితురాలి కంటే ముందు ఆమె భర్తకు కోవిడ్ సోకిందని.. కానీ అతడు అప్పటికే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాడని తెలిపారు. ఫలితంగా అతడు కోలుకున్నాడన్నారు. కానీ బాధితురాలు మాత్రం వ్యాక్సిన్ ఒక్క డోసు కూడా తీసుకోలేదని.. అందువల్లే ఆమె మృతి చెందిందని డాక్టర్లు చెప్పారు. అంటే కరోనాని, డెల్టా వేరియంట్ ని ఎదుర్కోవాలి అంటే మనందరం ఖచ్చితంగా వాక్సిన్ వేయించుకోవాలి. కనుక వాక్సిన్ పై ఎలాంటి అపోహలు ఉంచుకోకుండా, మీ టర్న్ రాగానే ఖచ్చితంగా వాక్సిన్ తీసుకోండి. ఈ విలువైన సమాచారాన్ని అందరికి తెలియజేయండి…