ఇంట కాస్త తగ్గినా, రచ్చ గెలిచిన ప్రధాని మోడీ…
దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా క్రమంగా తగ్గుతోందని అమెరికాకు చెందిన డేటా ఇంటలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ చెబుతోంది. 2019 నాటితో పోలిస్తే మోడీకి ఉన్న జనామోదం 20 పాయింట్ల మేర తగ్గినట్లు వెల్లడించింది. ఆగస్టు 2019లో మోడీకి 82 శాతం ఉండగా ఇప్పుడు 66 శాతానికి పడిపోయినట్లు అంచనా. జమ్ముకాశ్మీర్ విభజన, ఆర్టికల్370 రద్దు సమయంలో మోడీ నాయకత్వానికి ఎక్కువ జనామోదం లభించగా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆయన ఇమేజ్ గ్రాఫ్ పడిపోవడం తెలిసిందే. ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దలు అంటారు. మన ప్రధాని ఇంట కాస్త తగ్గినా కూడా రచ్చ మాత్రం నెంబర్ వన్ అనిపించుకుని భారతదేశం గర్వించేలా చేశారు.
ప్రపంచ నాయకులపై సర్వే నిర్వహించే ‘మార్నింగ్ కన్సల్ట్’ సంస్థ తన సర్వే నివేదికను శుక్రవారం విడుదల చేసింది. ఈ నివేదికలో అత్యంత మంది నమ్ముతున్న నేతగా నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలించారు. నరేంద్ర మోదీని 66 శాతం మంది ప్రజలు విశ్వసిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఆ తర్వాత 65 శాతం మంది ప్రజలు ఇటలీ ప్రధాని డ్రాగీ నాయకత్వాన్ని సమర్ధించారు. 63 శాతంతో మెక్సికో అధ్యక్షుడు లోపేజ్ ఓబ్రడార్ మూడో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ నాయకత్వాన్ని 54 శాతం మంది ప్రజలు సమర్ధించారు దీంతో ఆయన నాలుగవ స్థానంలో నిలిచారు.
వై. పార్వతి